జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన సంగతి తెలిసిందే. నివర్ తుఫాను కారణంగా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో DRO వెంకటేశ్వర్లు కు పవన్ కళ్యాణ్ పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా కానీ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాగా రైతులకు న్యాయం చేయాలంటే రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు ని ఉద్దేశించి కాకుండా కేవలం నానిని టార్గెట్ చేయటం వెనకాల పవన్ కళ్యాణ్ పెద్ద స్కెచే వేశారని ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
మేటర్ లోకి వెళితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంది. జిల్లాల వారీగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మరోపక్క దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం పట్ల భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. జగన్ మహిళలను ఆర్థికంగా పైకి తీసుకు వచ్చే రీతిలో వ్యవహరిస్తున్న క్రమంలో చాలామంది దేశంలో ఉన్న ప్రముఖ మహిళలు జగన్ ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయని విధంగా దాదాపు 30 లక్షల మంది పేదలకు మహిళల పేరిట జగన్ సర్కార్ చేపట్టిన ఈ కార్యక్రమం ఊహించని దానికంటే హైలెట్ అయ్యింది.
ఇలాంటి తరుణంలో ప్రజల దృష్టి మలచడానికి పవన్ కళ్యాణ్.. గుడివాడ నియోజకవర్గంలో పర్యటించి కావాలనే కొడాలి నాని ని తిట్టి, అతని రెచ్చగొట్టి.. ఏపీలో రాజకీయ ముఖచిత్రం కొడాలి నాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న తరహాలో క్రియేట్ చేయడానికి పవన్ వ్యవహరించినట్లు ఏపీ రాజకీయ నేతలు చెప్పుకుంటున్నారు. కొడాలి నాని ని రెచ్చగొడితే అతడు విమర్శిస్తే…. ఓ వర్గం మీడియా కొన్ని పార్టీలకు కొమ్ముకాసే మీడియా సంస్థలు.. కొడాలి నాని విమర్శించే డైలాగులు పదే పదే చూపుతూ..,ప్రజల దృష్టి మరల్చడానికి రెడీ గా ఉన్నాయ్ అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ విషయంలో ఇప్పటివరకు కొడాలి నాని స్పందించకపోవడం చాలా గ్రేట్ అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా జిల్లాల వారీగా జగన్ పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం.. ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నట్లు ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.