YS Jagan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తేల్చుకునేందుకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారా? సూచనలు , సలహాల దశ దాటి పోయి ఢిల్లీలో గలం వినిపిస్తాం అని ప్రకటించడం వెనుక మర్మం ఏంటి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాడానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం వెనుక లెక్కలేంటి? ఆ తర్వాత జగన్ నమ్మినబంటు చేసిన కామెంట్ల లెక్క ఇదేనా అంటూ ఏపీలో హాట్ చర్చ జరుగుతోంది.
మాట తప్పని వైఎస్ జగన్…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఓకే చెప్పిందన్న వార్తల నేపథ్యంలో ఏపీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఫిబ్రవరిలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటిచ్చారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ అసెంబ్లీ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసింది. ఏపీ అసెంబ్లీ తీర్మానంపై దీనిపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేస్తూ కొత్త చర్చకు తెరలేపారు.
విజయసాయిరెడ్డి ట్వీట్లో ఏముందంటే…
“విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఫిబ్రవరిలోనే సీఎం జగన్ హామీ ఇచ్చారు. అసెంబ్లీలో తీర్మానం చేసి సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు. హామీ ఇస్తే నిలబెట్టుకోవడం జగన్ సహజ గుణం. ఏపీ గుండె చప్పుడును ఢిల్లీలో వినిపించడానికి ఏమాత్రం వెనుకాడని ప్రభుత్వం ఇది.” అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే, కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు ఈ తీర్మానం చేశారా? విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం ఇదేనా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?