ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జీవనాడి ప్రాజెక్ట్ అయిన పోలవరం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కొద్దిగా స్పీడ్ పెంచింది. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడంతో..ఈ ప్రాజెక్టుని కేంద్రం పూర్తిచేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరుణంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తామే చేపడతామని చెప్పుకొని ప్రాజెక్టును అడ్డంపెట్టుకుని అవినీతి సొమ్మును అప్పట్లో సంపాదించడం జరిగింది అని స్వయంగా ప్రధాని మోడీ యే ఆరోపించడం జరిగింది. దీంతో చాలా వరకు పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి.
కానీ ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో పనుల స్పీడు వేగవంతమయ్యాయి. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం వృధా కాకుండా జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకు పోలవరం ప్రాజెక్టు కు మేలు చేశాయి. అయితే కేంద్రం 2014 అంచనాల మేరకు పోలవరం నిధులు ఇస్తామని అంతకుమించి ఇవ్వలేమని మధ్యలో మాట మార్చడంతో 2018-19 నిర్మాణ వ్యయం భారీగా పెరగటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితిలో కి వెళ్ళిపోయింది.
పోలవరం కోసం జగన్ ప్రయత్నాలు :
అసలే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం కావడంతో జగన్ సర్కార్ పోలవరం విషయంలో కేంద్రం నుండి నిధులు పొందే రీతిలో జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్రమంత్రులకు ప్రాజెక్టు పరిస్థితుల్ని వివరిస్తూనే ఉన్నారు. కానీ వారిలో పోలవరం విషయంలో మొన్నటివరకు పెద్దగా చలనం రాలేదు. మరి ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు గానీ ఒక్కసారిగా కేంద్ర జలవనరుల శాఖ పోలవరం నిర్మాణ వ్యయం 50 వేల కోట్లకు పైగానే ఉన్నట్లు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఏపీలో బలపడటానికి బీజేపీ ఎత్తుగడ :
అంత మాత్రమే కాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తో పాటు నిర్వాసితులకు న్యాయం చేసే తరహాలో కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నీ అపోహలు క్లియర్ కట్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోందట. దీంతో కేంద్ర మంత్రులతో జగన్ మాట్లాడటానికి ఢిల్లీ వెళ్లడానికి రెడీ అవుతున్నట్లు తాజాగా ఏపీ రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. నిర్వాసితులు అదేవిధంగా ప్రాజెక్టు వ్యయం భారం మొత్తం కేంద్రమే భరించేలా జగన్ మోహన్ రెడ్డి సరికొత్తగా ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ఈ ప్రాజెక్టును కట్టి..రాష్ట్రానికి అతి పెద్ద మేలు చేశామని తద్వారా పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవచ్చు అనే ఆలోచన చేస్తున్నట్లు ఏపీ రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?