ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం మతాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. దేవాలయాల విగ్రహాలు ధ్వంసం ఘటనలో ఆధారంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో చాలా వరకు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళ పేర్లు బయటపడటం సంచలనంగా మారింది.
అంతే కాకుండా కొన్ని చోట్ల సీసీ కెమెరాల్లో వాటికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్చకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మేటర్ లోకి వెళ్తే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇటీవల విజయవాడలో అర్చకుల తో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం లేని ఆలయ అర్చకులు ప్రస్తుతం ఇస్తున్న రూ.5వేల గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఇదే తరుణంలో రూ.10వేలుగా ఉన్న భృతిని రూ.16500 చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా అర్చకులకు వారసత్వ హక్కులు కల్పించడానికి కూడా ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేయడం జరిగినట్లు స్పష్టం చేశారు.