ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పరిపాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు అనేక సర్వేలలో ఫలితాలు రావటం అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మరోపక్క సరికొత్త సంక్షేమ పథకాలతో పాలన అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న జగన్ రాష్ట్రంలో పెన్షన్ లు నేరుగా ఇంటికి లబ్ధిదారుల చేతికి అందేలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ఆ తర్వాత ఇటీవల రేషన్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవడం అందరికీ తెలిసిందే. రేషన్ డోర్ డెలివరీ అందేలా ఫిబ్రవరి మొదటి నుండి.. సరికొత్త వాహనాలతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ ప్రతి ఇంటికి చేరే రీతిలో ఇటీవల విజయవాడ బెంజి సర్కిల్ లో జగన్ రేషన్ వాహనాలను ఓపెన్ చేయడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మరో సంచలనానికి తెరలేపారు సీఎం జగన్.
మేటర్ లోకి వెళ్తే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8585 వైయస్సార్ హెల్త్ క్లినిక్లు తీసుకురావడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇట్లు ఎన్నికల కోసం దాదాపు ఒక వెయ్యి 1692 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు మార్చి నెలాఖరు నాటికి ఏర్పాటు అయ్యేలా ఇప్పటి నుండే జగన్ ప్రభుత్వం పనులపై దృష్టి పెట్టడం జరిగింది.