NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..అగ్రవర్ణాలకు కూడా..అర్హతలు ఇవీ

jyothi paper targeted ys jagan

విదేశాలలో విద్యను అభ్యసించే ఏపీ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాల్లో విధ్యను అభ్యసించే వారికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్ధుల కోసం జగనన్న విదేశీ విద్యా దీవెనపై ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వలు జారీ చేసింది. ఇకపై వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి రూ.8లక్షల లోపు ఆదాయం పొందే వారి పిల్లలు ఈ పథకాన్ని పొందవచ్చు. అయితే కొన్ని నిబంధనలు పేర్కొంది. క్యూఎస్ ర్యాంకింగ్ లో ప్రపంచంలోని మొదటి 100 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్ధులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తుంది. 100 పైబడి 200 ర్యాంకింగ్స్ లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50లక్షల వరకూ ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తించనున్నది.

jyothi paper targeted ys jagan

 

ల్యాండింగ్ పర్మిట్ లేదా ఐ – 94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా ఫీజు రీయింబర్స్ మెంట్ ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. మొత్తం నాలుగు వాయిదాల్లో సెమిస్టర్ల ఫలితాలు రాగానే ఫీజు రీయింబర్స్ మెంట్ నగదు జమ చేస్తారు. 35 ఏళ్లలోపు ఉన్న వారు అందరూ ఈ పథకానికి అర్హులు. ఏపికి చెందిన వారై ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా సెప్టెంబర్ – డీసెంబర్ – జనవరి – మే మధ్య అర్హుల గుర్తింపు కోసం ప్రభుత్వం నోటిపికేషన్ విడుదల చేయనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ చేత అర్హుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.

 

గత ప్రభుత్వ హయాంలో రూ.6లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్న పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తించేది. విద్యార్ధుల సంఖ్యపై సీలింగ్, రూ.10 నుండి రూ.15 లక్షలు మాత్రమే ఆయా వర్గాలకు ఫీజు రీయింబర్స్ మెంట్ గా మంజూరు చేశారు. తాజాగా ప్రభుత్వం అగ్ర వర్ణాల వారితో పాటు విద్యార్ధుల పరిమితిని తీసేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ నగదును రూ.50లక్షల వరకూ పెంచింది ఈ సర్కార్. గత ప్రభుత్వం విదేశీ విద్యా దీవెనకు సంబంధించి 300 కోట్లకు పైగా బకాయి పెట్టింది.

బీజేపీ నేత సత్యకుమార్ గాలి తీసేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. మ్యాటర్ ఏమిటంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?