Pawan Kalyan: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి లక్ష వంతున ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇటీవల రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు ఇప్పటం గ్రామంలో ఇళ్లను, ఇంటి ప్రహరీగోడలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. జనసేన ప్లీనరీ సమావేశానికి తోడ్పాటు అందించారన్న రాజకీయ కక్షతోనే ప్రభుత్వం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో జనసేన సానుభూతిపరుల ఇళ్లను కూల్చివేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
రీసెంట్ గా పవన్ ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తాజాగా ఆయా కుటుంబాలకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని జనసేన నిర్ణయించింది. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జి నాదెండ్ల మనోహర్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. తమ వంతుగా వారు తిరిగి ఇళ్లను నిర్మించుకునేందుకు ఈ సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఆ కుటుంబాలను కలిసి ఆర్ధిక సాయం అందిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
AP Police: ఏపిలో భారీగా డీఎస్పీల బదిలీలు