Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు అని బీజేపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ, టీడీపీ తమకు సమదూరమని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పరోక్షంగా టీడీపీతో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. పేరుకు పొత్తు అని చెబుతున్నా జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యక్రమాలు చేస్తున్న దాఖలాలు లేవు. ఈ తరుణంలోనే జనసేన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయంటూ
ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ మూడు ఆప్షన్ లలో బీజేపీని పక్కన పెట్టి ఒంటరిగా పోటీ చేయడం అని కూడా చెప్పారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో కులాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు భవిష్యత్తులో రావాలి అని అన్నారు. బీజేపీ యేమో పూర్తిగా మతతత్వ పార్టీ అనేది జనమెరిగిన సత్యం. హిందూత్వం అనే పునాదులపై బీజేపీ ఉంది. ఈ రెండు పార్టీల పరస్పర విరుద్ధ భావాలు ఇక్కడ స్పష్టంగా అర్ధం అవుతోంది. శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక వీర మహిళల రాజకీయ అవగాహన, పునః శ్చరణ తరగతుల తరగతులను ఆ పార్టీ నేత నాగబాబు ప్రారంభించగా, పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. కుల, మత ప్రస్తావన లేని ప్రభుత్వాలు రావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. జరుగుతున్న విధ్వంసాన్ని సరి చేస్తూ అభివృద్ధి చేయాలని అన్నారు. ఏ పార్టీ అయినా ప్రారంభంలో చిన్న గానే ఉంటుందనీ, ఇద్దరు ఎంపీల నుండి 303 మంది ఎంపీల వరకూ బీజేపీ పోరాటం చేసి ఏదిగిందన్నారు.
జనసేన కూడా అంతేనని అన్నారు. బీజేపీ ఈ స్థాయికి రావడానికి 20 ఏళ్లు పట్టిందన్నారు. మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి అన్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ సిద్దాంతాలు ఇప్పుడు పని చేయవని కొందరంటున్నారనీ, తనకు ఆశలు లేవు, ఆశయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. పార్టీలో మహిళలను చైతన్య వంతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏపిలోని బీజేపీ నేతలు టీడీపీ, వైసీపీని విమర్శిస్తుండగా, పవన్ కళ్యాణ్ కేవలం అధికార వైసీపీ టార్గెట్ గానే విమర్శలు చేస్తున్నారు. పవన్ ప్రసంగంలోనే సిద్దాంత వైరుద్యాలు వ్యక్తం కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. బీజేపీతో స్నేహం కొనసాగుతుందా లేదా అనేది తెలియాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే.