Pawan Kalyan: ఏపిలో రాజకీయాలు ఇప్పుడే హీట్ ఎక్కుతున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాడుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో మమేకం అవుతోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధపడుతున్నారనీ, 2023 (వచ్చే ఏడాది)లోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనలకు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు కార్యక్రమాలకు షెడ్యుల్ ఖరారు చేసుకున్నారు. మరో పక్క బీజేపీ కూడా సమావేశాలు నిర్వహిస్తొంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Pawan Kalyan: విజయ దశమి నుండి పవన్ కళ్యాణ్ పర్యటన
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విజయ దశమి (అక్టోబర్ 5) నుండి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 5న తిరుపతి నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభం కానుంది. విజయ దశమి నుండి జిల్లా పర్యటనలకు పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని ఆ పార్టీ పిఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో ప్రతి నియోజకవర్గం ఉండేలా షెడ్యుల్ రూపొందిస్తున్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలలోనే ఎన్నికలు ఉంటాయని జనసైనికులు సిద్దంగా ఉండాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఇప్పటి వరకూ అంగీకరించిన సినిమా షూటింగ్స్ ను అక్టోబర్ నాటికి పూర్తి చేసుకుని అప్పటి నుండి పూర్తి స్థాయిలో జనాల్లోనే ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లుగా తెలుస్తొంది. పవన్ పర్యటనపై జనసేన నేత, ఆయన సోదరుడు నాగబాబు కూడా స్పందించారు. తిరుపతి నుండి అక్టోబర్ న విప్లవం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజా కోర్టులో ఎత్తిచూపుతాం
ప్రజా కోర్టులోనే ప్రభుత్వ వ్యతిరేకతను ఎత్తి చూపుతామని పేర్కొన్న నాదెండ్ల మనోహర్.. పవన్ కళ్యాణ్ విజయదశమి నుండి చేపట్టబోయే యాత్ర నభూతో న భవిష్యత్ అన్న రీతిలో సాగబోతుందని అన్నారు. ప్రజా క్షేమం, పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో అహర్నిశలు పని చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముందస్తు ఊహాగానాలను అధికార వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నా సీఎం జగన్ మదిలో ఏమున్నదో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో సంక్షమ పథకాలు యధావిధిగా కొనసాగుతున్న కారణంగా లబ్దిదారుల్లో ప్రభుత్వంపై సానుకూలతే ఉంది. కానీ ఇదే విధంగా మరో రెండేళ్ల పాటు ప్రతి నెలా అప్పులు చేస్తూ సంక్షేమ రధాన్ని పరుగులు పెట్టించడం ప్రభుత్వానికి కష్టతరమే. ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పుడే ఎన్నికలకు వెళితే ఉపయోగకరమన్న ధోరణిలో జగన్మోహనరెడ్డి ఉన్నారని వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణలో కేసిఆర్ గతంలో అవలంబించిన ఫార్మలానే ఇక్కడ జగన్ ఇంప్లిమెంట్ చేయనున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తారో లేదా ఆ జగన్నాధుడే తెలియాలి కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటి నుండే యాక్టివ్ అవుతున్నాయి. చూడాలి ఏమిజరుగుతుందో..?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?