జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి – జనసేన రెండో విడత కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. విజయవాడలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వందలాది మంది క్యూకట్టారు. ఓ పక్క వర్షం కురుస్తున్నా వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. తమ సమస్యలను పవన్ కళ్యాణ్ కు విన్నవించి విజ్ఞప్తులు అందజేశారు. వృద్ధులు, వికలాంగులు, వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుండి సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపిలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జనసేన పార్టీ తన వంతు కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పరంగా అయితే ఎన్నో సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. సీఎం సహాయ నిధి ఆరోగ్య శ్రీ లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వచ్చాయన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నేతల దౌర్జన్యాలపై బాధితులు చెప్పిన విషయాలను తనను కలచివేశాయన్నారు.
అనేక వర్గాల ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ఇంత మంది వచ్చి తమ బాధలను ఎందుకు వ్యక్తం చేస్తారని ప్రశ్నించారు. తదుపరి మీడియా సమావేశంలో వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ప్లీనరీలో సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగంలో ప్రతిపక్షాలను కౌరవులుగా పోల్చడంపై హస్యాస్పదంగా ఉందన్నారు.
ప్రధాని మోడీ.. బీజేపీ విధానాలపై మరో సారి ఘాటుగా విమర్శలు చేసిన తెలంగాణ సీఎం కేసిఆర్