Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి ఇప్పటం గ్రామానికి కాలినడకన బయలుదేరారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల నిర్మాణాలను కూల్చివేయడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. బాధితులను పరామర్శించేందుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామం సందర్శించనుండటంతో గ్రామంలో విస్తృతంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటం గ్రామం వెళ్లేందుకు నిన్న రాత్రే మంగళగిరికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ వాహనాల్లో మంగళగిరి నుండి ఇప్పటం బయలుదేరగా, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కారు దిగి పార్టీ శ్రేణులతో కలిసి కాలినడకన ఇప్పటం బయలుదేరారు. కొద్దిసేపటిలో ఇప్పటం చేరుకోనున్నారు. అరెస్టు చేస్తే చేసుకోనివ్వండి అంటూ పవన్ కళ్యాణ్ నడక సాగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఆయనను అనుసరిస్తున్నారు. మరో పక్క ఇప్పటంలో పోలీసులు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. బస్సులు కూడా రాని తమ గ్రామంలో రోడ్డు విస్తరణ ఏమిటంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కేవలం జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారన్న రాజకీయ కక్షతో గ్రామంలో రోడ్ల విస్తరణ చేపట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటం గ్రామం బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
* అరెస్టు చేసుకుంటే అరెస్టు చేసుకోనివ్వండి అన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు pic.twitter.com/CoyFwtLWlB— JanaSena Party (@JanaSenaParty) November 5, 2022