Janasena: ఏలూరు జిల్లా గణపవరంలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జి నాదెండ్ల మనోహర్ స్పందించారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రను ఉద్దేశించి సీఎం జగన్ .. పరిహారం అందని ఒక్క రైతు కుటుంబాన్ని చూపలేకపోయారంటూ విమర్శించారు. దీనిపై కౌంటర్ గా నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులను మోసం చేయడంలో సీబీఐ దత్తపుత్రుడు జగన్మోహనరెడ్డిని మించిన వాళ్లు ఉండరని విమర్శించారు మనోహర్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Read more: CM YS Jagan: లెక్కలు చెప్పి మరీ ప్రతిపక్షాలను తూర్పారబట్టిన సీఎం వైఎస్ జగన్
వాళ్ళు కౌలు రైతులు కాదా..?
వాస్తవానికి వైసీపీ చెప్పన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్ర ప్రభుత్వం నిధులను కలుపుకొంటే ప్రతి రైతుకు రూ.19,500లు రావాలి. కానీ ఇస్తుంది రూ.13,500లు మాత్రమేనన్నారు. అంటే ఒక్కో రైతుపై జగన్ సర్కార్ రూ.6వేలు మిగుల్చుకుంటోందని దీనికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో పర్యటించి 200 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందజేశారని చెప్పిన నాదెండ్ల మనోహర్..ఈ 200 మంది కౌలు రైతులు కాదు అని జగన్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. కౌలుకి భూమి తీసుకుని అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు రికార్డులో స్పష్టంగా రాశారన్నారు. వీరికి జివో 102, 43 లను అనుసరించి రూ.7 లక్షలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్.
Janasena: కంటి తుడుపుగా పరిహారం
మెజార్టీ కేసుల్లో త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లలేదని అన్నారు. వారికి కేవలం లక్ష చొప్పున పరిహారం ఇచ్చి సరిపెట్టారన్నారు. కౌలు రైతు కాని పక్షంలో అధికారులు వెళ్లి కంటి తుడుపుగా పరిహారం ఇవ్వరు కదా అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ.7లక్షల చొప్పున ఇచ్చేందుకు సీఎం బాధపడిపోతున్నారనీ, కానీ పవన్ కళ్యాణ్ తన కష్టార్జితం నుండి ప్రతి కుటుంబానికి లక్ష ఇస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. చిత్తశుద్ది లేకుండా ఇష్టానుసారం మాట్లాడి గొప్పలు చెప్పుకున్నా రైతులు విశ్వసించరని, వాస్తవాలు ఏమిటో రైతాంగానికి తెలుసునని పేర్కొన్నారు.