వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక జెసి ఫ్యామిలీ అనేక రాజకీయ ఇబ్బందులతో పాటు వివిధ కేసులు కూడా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో మాజీ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి మరియు ఆయన తనయుడు అష్మిత్ రెడ్డి ఇప్పటికే జైలుకెళ్లడం తర్వాత బెయిల్ మీద బయటకు రావడం జరిగింది.
ఇదిలా ఉండగా రెండు సంవత్సరాల తర్వాత ప్రభోదనంద ఆశ్రమంపై గొడవలు జరిగిన ఘటనకు సంబంధించి సీఐ ని కులం పేరుతో దూషించటం జరిగిందని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై తాజాగా అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. దీంతో జేసీ దివాకర్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు అడ్డంపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ప్రత్యర్థులపై పగ తీర్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కులం పేరుతో సీఐని దూషించినట్లుగా తప్పుడు కేసు పెట్టారని జేసీ వాపోయారు. ఆ సీఐ కులం ఏదో కూడా తనకు తెలియదు అని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై పెట్టిన తప్పుడు కేసును పరిష్కరించే వరకు ఈ నెల నాలుగో తారీకు నుండి ఆమరణ దీక్ష చేస్తానని జేసీ ప్రకటించారు.
దీంతో జెసి దివాకర్ రెడ్డి ప్రకటనతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యి భారీ స్థాయిలో పోలీసు బలగాలను తాడిపత్రి నియోజకవర్గంలో దింపడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోమవారం నుండి జెసి దివాకర్ రెడ్డి ఆమరణ దీక్షకు రెడీ అవుతున్నట్లు ప్రకటన తెలపటంతో ఆయన అనుచరులు మరియు జిల్లా టిడిపి క్యాడర్ కూడా భారీ స్థాయిలో ఈ దీక్షలో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.