Job alert: ఆదాయ పన్ను (ఐటీ) శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీ గా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎలాంటి వ్రాత పరీక్ష లేకండా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది. 150 కిపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా ఇవన్నీ స్పోర్ట్స్ కోటా కింద నియామకం జరగనున్నాయి. అర్హత కల్గిన వారు ధరఖాస్తు చేసుకోవాలని ఐటీ శాఖ సూచించింది. ఆన్ లైన్ ధరఖాస్తులు ఆగస్టు 25వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది.
150 కిపైగా పోస్టులు భర్తీ జరగనుండగా ఇందులో ఎంటిఎస్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇన్ కంట్యాక్స్ ఇన్స్ పెక్టర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఫోస్టులు ..155
ఎంటిఎస్ 64, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు 83, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఇన్ కంట్యాక్స్ పోస్టులు 8 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు..ఎంటీఎస్ పోస్టుకు పదవ తరగతి, మిగిలిన పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో, యూనివర్శిటీ స్థాయి పోటీల్లో, రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ జట్టులో సభ్యులై జాతీయ క్రీడల్లో ఏదో ఒకటి పాల్గొని ఉండాలి. 18 నుండి 30 సంవత్సరాల మద్య వయసు వారై ఉండాలి.
ఎంపిక విధానం.. ధరఖాస్తుల పరిశీలన ద్వారా షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ ల పరిశీలన తరువాత అవసరమైతే ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
ధరఖాస్తు విధానం .. ఆన్ లైన్ లో
ధరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ ..ఆగస్టు 25
వైబ్ సైట్ : incometaxmumbai.gov.in