ఏపి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ని ప్రముఖ జువెలరీ బ్రాండ్ జోయాలుక్కాస్ చైర్మన్ అండ్ ఎండీ అలుక్కాస్ వర్గిస్ జాయ్ కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం అలుక్సాస్ వర్గీస్ జాయ్ .. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. సీఎం జగన్ తో సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. ప్రధానంగా ఏపిలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు.
ఈ సందర్భంలో ఏపిలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ విధానాలను సీఎం జగన్ ఆయనకు వివరించారు. ఏపిలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, సత్వర అనుమతులపై వివరాలు తెలియజేశారు. జూయాలుక్కాస్ వస్తే స్వాగతిస్తామని, సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సీఎం జగన్ ఆయనకు హామీ ఇచ్చారు.
చింతకాయల విజయ్ కి మరో సారి ఏపీ సీఐడీ నోటీసులు..ఆ అభియోగాలపైనే..?