NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ju NTR: వరద విరాళం..! టాలీవుడ్ ‌నుండి మొదటిగా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్..! తర్వాత చిరు, మహేష్ కూడా..!!

Ju NTR: ఏపిలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా అపార నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురంతో జిల్లాల్లో భారీ వర్షాలు, వరద భీభత్సంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దాదాపు 9వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాధమిక అంచనా. రాష్ట్రంలో జరిగిన వరద నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్రానికి నివేదించడంతో పాటు తక్షణం వెయ్య కోట్లు సాయం అందించాలని కోరారు. సీఎం జగన్మోహనరెడ్డి విజ్ఞఫ్తి మేరకు వరద నష్టం అంచనాలకు  కేంద్ర బృందం మూడు రోజుల పాటు తుఫాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించి వెళ్లి వెళ్లింది. ఈ తరుణంలోనే ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వరద బాధితులకు సహాయం అందించేందుకు సినీ ప్రముఖులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Ju NTR, megastar, mahesh contribute each 25 lakhs
Ju NTR megastar mahesh contribute each 25 lakhs

ఇటీవల ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ, ఏపి ప్రభుత్వానికి మధ్య ఆన్ లైన్ టికెటింగ్, బెన్ఫింట్ షోలు, టికెట్ల ధరల విషయంలో ఒక పేచీ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇంత వరకూ సినీ ప్రముఖులు ఎవ్వరూ వరద బాధితుల సహాయంపై స్పందించలేదు. ఆన్ లైన్ టికెటింగ్ తీసుకురావడంపై మెగాస్టార్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే టికెట్ల ధరల విషయంలో పునరావాలోచన చేయాలంటూ విజ్ఞప్తి అయితే చేశారు. వరద బాధితులకు విరాళం ఏమీ ప్రకటించలేదు. ప్రముఖ సినీ నిర్మాత డి సురేష్ బాబు కూడా ఏపి ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే  పెద్ద సినిమాల నిర్మాణం, ధియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకం అవుతోందని అయన అన్నారు.

అయితే సినీ పరిశ్రమ నుండి అందరి కంటే ముందుగా నేడు జూనియర్ ఎన్టీఆర్ వరద బాధితుల సహాయంపై స్పందించారు. ఏపిలో వరద బాధితుల కోసం రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. రాష్ట్రంలో వరద బాధితుల కడగండ్లు తనను కలచివేశాయనీ, అందుకే వారికి సాయంగా తన వంతుగా కొద్ది మొత్తం విరాళంగా ఇస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. సినీ ప్రముఖులు ఎవ్వరూ స్పందించకముందే జూనియర్ ఎన్టీఆర్ స్పందించి రూ.25 లక్షలు ప్రకటించడం విశేషం. ఆ కొద్దిసేపటికే మెగాస్టార్ చిరంజీవి 25 లక్షలు,  మహేష్ బాబు 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనతో చేశారా లేక వారే గతంలో మదిరిగా సాయం అందించాలని చేశారో గానీ ముగ్గురు ప్రముఖ హీరోలు ఒకే రోజు 25 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?