Junior NTR: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ను చూసి జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురైయ్యారు. సతీమణి ప్రణతి, సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ .. ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసి తీవ్ర భావోద్వేగానికి లోనై కంట తడిపెట్టారు. తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి, పిల్లలకు ఎన్టీఆర్ సోదరులు ధైర్యం చెప్పారు.
అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ వైద్యుల ట్రీట్మెంట్ తారకరత్న స్పందిస్తున్నారనీ, ఆరోగ్యం నిలకడగానే ఉందని జూనియర్ చెప్పారు. అన్నయ్య కు మంచి ట్రీట్మెంట్ అందుతోందని తెలిపారు. “27వ తారీఖున మాకుటుంబంలోని అనుకోని ఘటన జరిగింది. అన్నయ్యకు మెరుగైన వైద్యం అందుతోంది. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని పోరాడుతున్నారు. వైద్యంతో పాటు ఆయన ఆత్మబలం, మనోబలం, అభిమానుల ఆశీర్వాదం ఉంది. ముఖ్యంగా తాతగారు (సీనియర్ ఎన్టీఆర్) ఆశీర్వాదం ఆయనకు ఉంది. ఎంతో మంది ఆశీర్వాదం ఆయనకు ఉంది. త్వరలోనే ఈ పరిస్థితి నుండి కోలుకుని ఇదివరకటి లాగే మనందరితో ఆనందగా ఉండాలని భవంతుడిని మనసారా ప్రార్ధిస్తున్నాను. అభిమానులంతా అన్నయ్య కోసం పార్ధించండి. అభిమానుల ఆశీర్వాదం, ఆలోచనలు ఎంతో ముఖ్యం” అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి తనకు ఎంతో ఆప్తులనీ, ఈ పరిస్థితుల్లో మంత్రి తమ వెంట ఉండి సాయం చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. నిమన్స్ నుండి ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ మరో ఇద్దరు వైద్యులను పిలిపించారని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ మీ అందరి ఆబిమానంతో తప్పకుండా తమ్ముడు తొందరగా కోలుకుని మనందరి ముందుకు రావాలని అభిమానులు ప్రార్ధించాలి అని కోరుకుంటున్నానన్నారు.
బీఆర్ఎస్ ఎంపీలను భోజనాలకు ఆహ్వానించిన సీఎం కేసిఆర్ .. ఎందుకంటే..?