NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravati: ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి.. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా

justice akula venkata sesha sai ap high court new CJ cj prasanth kumar mishra oath as SC Judge
Share

Amaravati: ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి నియమితులైయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు నిర్వహించిన ప్రశాంత్ కుమార్ మిశ్రా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల కోలిజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

justice akula venkata sesha sai ap high court new CJ cj prasanth kumar mishra oath as SC Judge
justice akula venkata sesha sai ap high court new CJ cj prasanth kumar mishra oath as SC Judge

 

ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ పేర్లను సీజేఐ నేతృత్వంలోని కోలిజియం మే 16న కేంద్రానికి సిఫార్సు చేయగా రెండు  వారాల్లోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ నిన్న ఆమోద ముద్ర వేయడంతో ఇవేళ వీరు ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలో ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటి వరకూ న్యాయమూర్తిగా పని చేస్తున్న వెంకట శేషసాయిని సీజేగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ స్పెషల్ సెక్రటరీ రజిందర్ కశ్వప్ నోటిఫికేషన్ జారీ చేశారు. తాజాగా ఆయనకు చీఫ్ జస్టిస్ బాధ్యతలు అప్పగించారు.

బీజేపీలో చేరికలు ఆగిపోవడానికి కారణం అదేనంటూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి


Share

Related posts

Covid Hospital: ఏపీ ప్రభుత్వం అద్భుతం..! 15 రోజుల్లోనే కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం

Muraliak

Pawan Kalyan: పవన్ పై తెలంగాణ బీజేపీ పునరాలోచన..!! నిజమెంతో..!?

Muraliak

Prabhas : ప్రభాస్ మానియా మామ్మూలుగా లేదు.. రాధే శ్యామ్ సినిమాకోసం రంగంలోకి దిగుతున్న CM కొడుకు!

Ram