కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వానికి, కైకలూరు టీడీపీ ఇన్ చార్జి పదవికి రాజీనామా చేశారు. కైకలూరులో బహిరంగ సభ ఏర్పాటు చేసి మరీ తన రాజీనామా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా టీడీపీపై సంచలన కామెంట్స్ చేశారు జయమంగళ వెంకట రమణ. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు నచ్చి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన జయమంగళ వెంకట రమణ.. ఇచ్చిన మాటకు కట్టుబడే ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మాటలు విని మోసపోయానని అన్నారు. పార్టీలో కష్టపడినా తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ లో అంతా గ్రూపు రాజకీయాలే నడుస్తున్నాయనీ, అందుకే టీడీపీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, కొల్లేరు వాసుల జీవ ప్రమాణాల మెరుగు కోసమే పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనతో పాటు వచ్చే నేతలను వైసీపీలోకి తీసుకువెళతానని జయమంగళ వెంకట రమణ ప్రకటించారు.
గత కొద్ది రోజులుగా జయమంగళ వెంకట రమణ టీడీపీకి రామ్ రామ్ చెప్పి వైసీపీలో చేరనున్నారంటూ వార్తలు వచ్చాయి. వైసీపీలో చేరేందుకు అంగీకారం తెలిపిన తర్వాత ఆయనకు ప్రభుత్వం గన్ మెన్ లను ఏర్పాటు చేసింది. సీఎం జగన్ ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. టీడీపీ – జనసేన పొత్తుల్లో భాగంగా కైకలూరు నియోజకవర్గాన్ని రాబోయే ఎన్నికల్లో జనసేనకు కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జయమంగళ వెంకట రమణ పార్టీ మార్పుకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. 2009 ఎన్నికల్లో కైకలూరు నుండి టీడీపీ అభ్యర్ధిగా జయమంగళ వెంకట రమణ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించడంతో కామినేని శ్రీనివాస్ పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగానూ కామినేని బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో మరో సారి పోటీ చేసిన జయమంగళ వెంకటరమణ వైసీపీ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్) చేతిలో పరాజయం పాలైయ్యారు.
తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మాణానికై…