Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది డిసెంబర్ చివరిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు, పార్టీ విధి విధానాలు ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో సరిగ్గా పార్టీ ప్రకటించడానికి రెడీ అవుతున్న క్రమంలో రజిని అనారోగ్యానికి గురి కావడం వెంటనే హాస్పిటల్ లోకి జాయిన్ అవ్వడంతో ఇది దైవ నిర్ణయం కాదని, తాను రాజకీయాల్లోకి రావడం భగవంతుడికి ఇష్టం లేదు అంటూ రజనీకాంత్ తన అభిమానులకు లెటర్ ద్వారా తెలియజేసి వెనకడుగు వేయడం జరిగింది.
ఇదిలాఉంటే అప్పట్లో రజిని రాజకీయాల్లోకి వస్తున్నారు అన్న సమయంలో ఆల్ రెడీ రాజకీయాల్లో ఉన్న కమల్ హాసన్…తమిళ ప్రజల ప్రయోజనాల కోసం రజినీ ముందుకొస్తే తాను ఆయనతో కలిసి పని చేయడానికి రెడీ అంటూ ఓపెన్ గానే ఆఫర్ ఇచ్చారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఈరోజు రజనీ తో కమల్ హాసన్..ఆయన నివాసంలో భేటీ అవ్వటం తమిళ రాజకీయాల్లో సంచలనం అయింది. త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో.. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమలహాసన్ సడన్ గా రజినీతో భేటీ అవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే కేవలం రజనీకాంత్ అనారోగ్యం కారణంగా రెస్ట్ తీసుకున్న తరుణంలో..పలకరించడానికి కమల్ హాసన్ భేటీ అయినట్లు సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం. మరోపక్క మాత్రం కచ్చితంగా కమలహాసన్ రాజకీయ ఎత్తుగడ తోనే రజినీతో భేటీ అయినట్లు తమిళ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. అంతకుముందే కమలహాసన్ పార్టీ 2019 ఎన్నికల టైంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయగా పెద్దగా స్థానాలు రాలేదు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల టైం కాబట్టి రజనీతో భేటీ అయి మద్దతు తీసుకుని తమిళ అసెంబ్లీలో కొన్ని స్థానాలు రాబట్టడానికి కమల్ సరికొత్త పొలిటికల్ స్ట్రాటజీ వేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.