Kambhampati Hari Babu: కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించింది. ఏపికి చెందిన సీనియర్ బీజేపీ నేత కంభంపాటి హరిబాబుకు గవర్నర్ గిరి వరించింది. ఆయన మిజోరం గవర్నర్ గా నియమితులైయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బంగారు దత్తాత్రేయ ను హరియాణాకు బదిలీ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ గా మంగుభాయ్ ఛగన్ భాయ్ పటేల్, కర్నాటక గవర్నర్ గా థావర్ చంద్ గెహ్లాట్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్రన్ విశ్వనాథ్ పర్లేకర్, గోవా గవర్నర్ గా పిఎస్ శ్రీధరన్ పిళ్లై, త్రిపుర గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, జార్ఖండ్ గవర్నర్ గా రమేష్ బయాట్ నియమితులైయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read More: Corona Vaccine: ఇది నిజంగా వండరే..! దీనికి వైద్య నిపుణులు ఏమంటారో..?
త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో ఏపి నుండి నేతలకు అవకాశం లేదని సమాచారం. అందుకే ఇక్కడ సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎంపి కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమించినట్లు తెలుస్తోంది. కంభంపాటి ఉమ్మడి ఏపిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా, విశాఖ పార్లమెంట్ సభ్యుడుగా, బీజేపీలో వివిధ పదవుల్లో పని చేశారు.