Katti Mahesh: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేష్ మృతి చెందారు. 2 వారాల క్రితం నెల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
తొలుత నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడుతుంది అనుకుంటున్న తరుణంలో ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం కన్నుమూశారు. ఇటీవలే అయిన వైద్య ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.17 లక్షలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కత్తి మహేష్ మృతి పట్ల సిని, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.