చంద్రబాబు పొలిటికల్ కెరియర్ లో మాయని మచ్చగా మిగిలిపోయింది ఓటుకు నోటు కేసు. కాగా ఈ కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ తెలుగు రాజకీయాల్లో నెలకొంది. గతంలో మత్తయ్య విషయంలో కేసుకు సంబంధించి టెక్నికల్ రీజన్స్ తో హైకోర్టు చంద్రబాబు పాత్ర లేనట్టు పేర్కొనటం జరిగింది.
ఈ క్రమంలో ఈడి దగ్గర ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నివేదిక తీసుకొని మళ్లీ ఏసీబీ ఎంటర్ అయితే విషయం వేరే లాగా ఉంటుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈడి నివేదిక ఆధారంగా ఏసీబీ ముత్తయ్య ని విచారణ చేస్తే రివైజ్డ్ ఛార్జిషీట్ పెట్టే అవసరం కేసీఆర్ సర్కార్ కి ఉంటుంది. ఈ క్రమంలో కెసిఆర్ లైట్ తీసుకుంటే ఏసీబీ.. విచారణ రేవంత్ రెడ్డి దగ్గరకు మళ్లీ ఆపేస్తే.. కేసు ముందుకు సాగే అవకాశం లేకపోవటం మాత్రమే కాక ఈడి మళ్లీ ఎంటరైన జరిగేది ఏమి ఉండదని అంటున్నారు.
సో కేసీఆర్ ఈ విషయంలో మొండి పట్టుదలతో.. విచారణ సంస్థలు కూడా సహకరిస్తే మాత్రం చంద్రబాబు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ముత్తయ్య బయట చాలా ప్రముఖ టీవీ ఛానల్ లకి ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లు ఇవ్వటం 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఏ క్షణం లో అయినా న్యాయస్థానాల నుండి ఒక బ్రేకింగ్ న్యూస్ వినబడే అవకాశం ఉందని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు.