KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకే మాటపై ఉండనున్నారా? కీలక సమయంలో ఈ ఇద్దరు నేతలు ఒకే నిర్ణయం తీసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా కల్లోలం నేపథ్యంలో రోజువారి కార్యక్రమాలపై ఏపీలో కర్ఫ్యూ, తెలంగాణలో లాక్ డౌన్ పొడగించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ఇద్దరు సీఎంలు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారని చెప్తున్నారు.
Read More: KCR: గ్రాప్ పెంచుకున్న కేసీఆర్…గాలి తీసేస్తున్నది ఎవరంటే….
కేసీఆర్ డిసైడ్ అయిపోయారా?
కరోనా కట్టడి చర్యలు జూన్ చివరి వరకు చేపట్టవచ్చని అవసరమైన చోట కరోనా కట్టడి కోసం లాక్డౌన్, కర్ప్యూ లాంటి చర్యలను కొనసాగించవచ్చని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. తెలంగాణలో ఈనెల 30 వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. 30వ తేదీ ఆదివారం జరగనున్న సమావేశంలో లాక్ డౌన్ పొడగింపు లేదా ముగింపుపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపునకు సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారని , అయితే, లాక్ డౌన్ అమలులో కొన్ని సడలింపులు ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు.
Read More: KCR: షాక్ః కేసీఆర్ చేసిన ప్రకటనే లైట్ తీసుకుంటున్న అధికారులు
ఏపీ సీఎం ఏం చేయనున్నారంటే…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 31న రాష్ట్రంలో కరోనా విస్తృతి , రికవరీ , ఇతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. కర్ఫ్యూ పొడగింపుపై తగు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. కర్ఫ్యూ అమలులో మే 31 తర్వాత క్రమంగా కొన్ని మినహాయింపులు ఇవ్వడమా లేదా యథాస్థితిని కొనసాగించడమా? అనే దానిపై ఈ సమీక్షా సమావేశంలోనే సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ పొడిగించే ఆలోచనలో ఉందని వివిధ వర్గాలు అంచనా వేస్తున్నాయి.