KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే సీరియస్ గా స్పందించాల్సిన విషయం ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ ప్రజల కోసం కొన్ని వర్గాలపై కొరడా ఝులిపించకపోతే సామాన్యులు నష్టపోతారని అంటున్నారు. అదే కోవిడ్ వ్యాక్సిన్. కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండటంతో ఇదే అదునుగా దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ దొంచుకుంటున్నాయి. దీంతో ఇటు వ్యాధికి బాధపడాలా …. అటు దోపిడికి భయపడాలా అంటూ పలువురు సోషల్ మీడియాలో పలువురు చర్చించుకుంటున్నారు.
దోచుకుంటున్నారు…
తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండటంతో ఇదే అదునుగా దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ దొంచుకుంటున్నాయి. దీంతో కోవిడ్ పేషెంట్లకు ఇచ్చే రెమిడెసివర్ కు డిమాండ్ పెరిగింది. మెడికల్ షాపుల్లో కూడా రెమిడెసివర్ కు కొరత ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి పలు ప్రైవేట్ హాస్పిటల్స్ వాటి నిల్వలు ఉంచుకున్నాయి. కరోనా పేషెంట్ల నుండి పలు కార్పోరేట్ హాస్పిటల్స్ వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో మారింత రెచ్చిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి విశాఖపట్టణం, విజయవాడలో ఉందని పలువురు పేర్కొంటున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల సైతం తమ వద్ద నుండి వేలకు వేలు దొంచుకుంటున్నారంటూ బాధితులు కొందరు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు.
టీకా ఉత్సవం మాత్రం…
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రధాని మోడీ టీకా ఉత్సవాలను ప్రారంభించారు. ఆదివారం నుంచి భారీ ఎత్తున టీకా పంపిణీ చేపట్టాలని భావించారు. టీకా ఉత్సవ్ నాడు 2.7 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. కానీ, అదీ అరకొరనే అంటూ అధికారిక వర్గాలు పేర్కొంటున్నారు. 45 ఏళ్ల పైబడ్డ వారికి వ్యాక్సిన్ అందించాలని చెప్పినప్పటి నుంచి కేంద్రాలకు భారీ ఎత్తున జనం తరలివస్తున్నారు. అయితే, చాలా మందికి వ్యాక్సిన్ అందించలేకపోతున్నాయి రాష్ట్రాలు. తమ దగ్గర నిల్వలు లేవంటూ కేంద్రాన్ని కోరుతున్నాయి. దేశంలో కరోనా కేసులు అధికంగా మహారాష్ట్రతో పాటు ఛత్తీస్ఘడ్, ఒడిషా, ఏపీ, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాశాయి. తమకు భారీగా వ్యాక్సిన్లు కావాలని కోరుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ సెంటర్లను మూసివేస్తుంటే.. టీకా వేయించుకునేందుకు వచ్చిన వారిని మధ్యలోనే తిరిగి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?