KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు ఆచరణలో ఊహించని రీతిలో వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్న హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తుంటే… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులు తమకెప్పుడు ఈ అవకాశం అంటూ ఎదురుచూస్తున్నారు. అయితే, ఇదే ఎపిసోడ్లో మరో కీలక పరిణామం. ఇతర వర్గాలకు సైతం ఇదే తరహా ప్రయోజనాలు అందించాలన్న డిమాండ్.
Read More: KCR: హుజురాబాద్ లో అభ్యర్థితో కేసీఆర్ ఏం చెప్పదల్చుకున్నారంటే…
ఎన్నికలకు ముందే ఈ స్కీం….
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చింది. అయితే, సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో హుజురాబాద్ కంటే ముందుగానే ఈ పథకాన్ని అమలుకు నిర్ణయం తీసుకొని ఇప్పటికే నిధులు కూడా విడుదల చేసింది. ఓ వైపు ఈ ట్విస్టులు కొనసాగుతుంటే మరోవైపు దళిత బంధు ప్రకటించిన తర్వాత ఇదే తరహా ప్రయోజనాలు కల్పించాలంటూ రకరకాల వర్గాల నుంచి డిమాండ్లు తెరపైకి వస్తూనే ఉన్నాయి. బీసీ బంధు గురించి ఆర్.కృష్ణయ్య ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
Read More: KCR: కేసీఆర్కు షాక్ ఇస్తున్న హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు
ఎప్పుడు ఆ పని చేస్తావు కేసీఆర్?
ఎన్నికలు వచ్చినప్పుడే పథకాలు గుర్తుకు వస్తాయా..? అంటూ సీఎం కేసీఆర్ను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వి. హనుమంతరావు ప్రశ్నించారు. దళితులకు దళిత బంధు ప్రకటించినట్లే బీసీలకు బీసీ బంధు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ బంధు ఇవ్వకుంటే టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని వీహెచ్ హెచ్చరించారు. పంజాగుట్ట సర్కిల్ లో వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో పెడతారు? అని మండిపడ్డారు.