KCR తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు ఫిబ్రవరి 17న. సహజంగా నేత పుట్టిన రోజు అంటే నాయకులు, కార్యకర్తలే ప్రత్యేకంగా జరుపుకొంటుంటారు. కానీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు ఫిబ్రవరి 17న అన్ని విభాగాల వారు ఇందులో పాల్గొంటున్నారు. వారు కూడా ప్రముఖులు కావడం గమనార్హం.
మెగాస్టార్ చిరంజీవి, వైసీపీ ఎమ్మెల్యే , సినీనటి రోజా , ప్రిన్స్ మహేష్ సమా ఎందరో సినీ, రాజకీయ , సామాజిక ప్రముఖులు కేసీఆర్ పుట్టిన రోజు కార్యక్రమంలో పాలు పంచుకుంటుండటం స్పెషాలిటీ.
KCR ఇంతకీ ఏం జరగనుంది ?
తెలంగాణ సీఎం పుట్టిన రోజు పురస్కరించుకొని కోటి వృక్షార్చన అనే బృహత్తర కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టింది. ఆ రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించి, హరిత ప్రేమికుడైన కేసీఆర్కు పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలనేది గ్రీన్ ఇండియా చాలెంజ్ సంకల్పం .
చిరంజీవి ఏమంటున్నారంటే….
కోటి వృక్షార్చన లో పాల్గొని మొక్కలు నాటుదాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టినరోజు కానుకగా ఇద్దామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళ కళా అడాలి అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష, కోరిక. దాని కోసం మన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక గంటలో
ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వామ్యం అయి మొక్కలు నాటుదాం మన ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం.. వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుందాం అని చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
రోజా మాట ఇదే…
కోటి వృక్షార్చనలో పాల్గొని సీఎం కేసీఆర్కు హరిత కానుక అందిద్దామని నటి, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ నెల 17 న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొందామని, ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దామని చెప్పారు.
మహేష్ మాట ఏందంటే…
ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వహిస్తున్న కోటి వృక్షార్చన కార్యక్రమానికి ప్రజలందరూ అండగా ఉండాలని ప్రముఖ నటుడు మహేశ్బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో గ్రీన్ ఇండియా చాలెంజ్ గీతం నేపథ్యంలో మహేశ్బాబుతోపాటు ఆయన పిల్లలు గౌతమ్, సితార మొక్కలు నాటుతూ కనిపిస్తున్నారు. భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్) తగ్గించాలంటే మొక్కలు నాటుతూ వాటిని పరిరక్షించడమే ఏకైక మార్గమని మహేశ్బాబు ట్వీట్ చేశారు.