KCR: తెలంగాణ లో కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కరోనా సమయంలో పెద్ద రిలీఫ్ అని అంటున్నారు. రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా తాజాగా త్వరలోనే 18 ఏళ్లు పైబడ్డ వారికి కూడా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కోసం ఆదేశాలు వెలువరించారు.
Read More: YS Jagan: జగన్ ను అడ్డంగా బుక్ చేస్తున్న కేసీఆర్ ?
ఆ సమస్యతోనే…
18 ఏళ్లు పైబడినవారికి మే 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్కు అనుమతి ఇచ్చింది. అయితే, వ్యాక్సిన్ల కొరత కారణంగా తెలంగాణ లో ఈ ప్రక్రియ నామమాత్రంగా సాగింది. అయితే, 18 ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సిన్ పంపిణీ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రైవేటు ఆస్పత్రులు 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు విడుదల చేసింది. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ సంస్థలు, ఆయా కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల ప్రతిపాదన మేరకు ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సినేషన్ డ్రైవ్లు నిర్వహించవచ్చు. 18 ఏళ్లు పైబడ్డవారు వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకోవాలని, వ్యాక్సినేషన్కు ప్రైవేట్ ఆస్పత్రులతో అనుసంధానం కావాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు.
Read More: Harish Rao: హరీశ్ రావు ఆరోగ్య మంత్రి అయిపోయినట్లేనా?
రెండో డోసు…
తెలంగాణలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం రేపటి నుంచి జరిగేందుకు సంబంధించిన విదివిధానాలను రూపొందించాలని మంత్రి హరీష్ రావును వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తిచేసుకుని రెండో డోసు వేసుకునేందుకు కోసం అర్హత కలిగిన వారు దగ్గరర్లోని ప్రభుత్వ వాక్సినేషన్ కేంద్రానికి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు.