KCR : తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాట్లలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ పార్టీల నేతలు ఆమెను కలుస్తున్నారు. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ స్వరణ్ జిత్ సేన్ కలిశారు. ఇవి కొత్త పోకడలకు శ్రీకారం చుడుతున్నాయని అంటున్నారు.
అసలేం జరిగిందంటే…
మాజీ డీజీపీ స్వరణ్ జిత్ సేన్ సతీమణి అనితా సేన్… గతంలోనే వైఎస్ షర్మిలను కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే కలిశామని.. ఇతరత్రా ఎలాంటి విషయాలు చర్చించలేదని ఆమె చెప్పినా.. కొత్త పార్టీ పెట్టబోయే ముందు ఆమె కలవడం ప్రాధాన్యత సంతరించుకోగా.. ఇప్పుడు స్వరణ్ జిత్ సేన్ కూడా వచ్చి చర్చలు జరపడం హాట్ టాపిక్ అయ్యింది. స్వరణ్ జిత్ సేన్.. వైఎస్ షర్మిల పార్టీలో చేరతారనే ప్రచారం కూడా కొంత కాలంగా నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా లోటస్పాండ్లో షర్మిలను కలిసిన ఆయన.. వివిధ అంశాలపై ఆమెతో చర్చించారు.
ఇప్పుడు ఏం జరిగిందంటే..
వైఎస్ షర్మిల సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ డీజీపీ స్వరణ్జీత్ సేన్ ప్రజలకు సేవ చేసేందుకు అవసరం అయితే వైఎస్ షర్మిలతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. వైఎస్ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవం అందుకే పార్టీ పెట్టబోతున్న షర్మిలను మర్యాద పూర్వకంగా కలిశానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీకి అవకాశం ఉందన్న ఆయన… ప్రజలకు సేవ చేసేందుకు అవసరం అయితే వైఎస్ షర్మిలతో కలిసి పని చేస్తానని ప్రకటించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?