KCR: తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎంత మాత్రం జీర్ణించుకోలేని పరిణామం ఇది. కరోనా కల్లోలం సమయంలో ఆయన ధైర్యంగా వేసిన అడుగు పలితాలు తారు మారు అయ్యేలా ఉన్నాయి కాబట్టే ఈ చర్చ జరుగుతోంది. కరోనా కలకలం కొనసాగుతున్న సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని, వరంగల్ లోని ఎంజీఎం దవాఖనను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఆస్పత్రుల్లో కేసీఆర్ టూర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇప్పుడు ఆ రెండు ఆస్పత్రుల కారణంగానే మళ్లీ కేసీఆర్ వార్తల్లోకి ఎక్కారు.
Read More: KCR: షాక్ః కేసీఆర్ చేసిన ప్రకటనే లైట్ తీసుకుంటున్న అధికారులు
ధైర్యం చెప్పిన కేసీఆర్….
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో, వరంగల్ ఎంజీఎంలో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ పలు వార్డులను పరిశీలించారు. కరోనా రోగులకు ఆయన ధైర్యం చెప్పారు. సౌకర్యాల గురించి, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్నారని పేర్కొంటూ వైద్యులను, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. అయితే, ఇప్పుడు అదే ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. తమకు తగు న్యాయం చేయాలంటూ డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు.
Read More : KCR: ఏపీలో జగన్ కాకుండా కేసీఆర్ కొత్త మిత్రులు ఎవరో తెలుసా?
కన్నెర్ర చేసిన తెలంగాణ సీఎం…
జూనియర్ డాక్టర్ల ఆందోళనపై స్పందిస్తూ చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేయవద్దని కోరారు. సమయం సందర్బాలను చూడకుండా, సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరికాదని కేసీఆర్ పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలు అయితే పరిష్కరించడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని తెలిపారు. కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని ఆయన వ్యాఖ్యానించారు. కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని కేసీఆర్ పేర్కొన్నారు.