KCR: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుకూలించనుందా? ఊహించని నిర్ణయంతో వివాదం కొత్త మలుపు తిరగనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేయడం తెలిసిన సంగతే. దీని కేంద్రంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అజెండా ముందుకు తీసుకుపోనున్నారని అంటున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కేసీఆర్ నెత్తిన పాలు పోసినట్లు అవుతుందని అంటున్నారు.
Read More: KCR: ఏపీ ప్రజలకు కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే…
ఇది బ్యాక్ గ్రౌండ్…
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం కృష్ణా, గోదావరి జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టంలోని 85వ సెక్షన్ ప్రకారం కేంద్రం కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ జలాల యాజమాన్యబోర్డు (జీఆర్ఎంబీ)లను ఏర్పాటు చేసింది. చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గెజిట్ విడుదలతో రెండు నదులపై ఇరు రాష్ర్టాల్లో ఉన్న ప్రాజెక్టులు బోర్డుల ఆధీనంలోకి వెళ్లాయి. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, విద్యుత్తు ఉత్పత్తి అంశాలన్నీ బోర్డుల నియంత్రణలోనే కొనసాగుతాయి.
Read More: KCR: ఉద్యోగాల భర్తీః మోడీ, కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఇదే
కేసీఆర్ మాట ఇది…
రెండు రాష్ర్టాల మధ్య నదీ జలాలను పునః పంపిణీ చేసిన తర్వాతే బోర్డుల పరిధిని నిర్ణయించాలని తెలంగాణ మొదట్నుంచీ డిమాండ్ చేస్తోంది. అయితే, తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటుతూ ముందుకు సాగనున్నారని, తద్వారా మళ్లీ సెంటిమెంట్ను రగుల్చుకునే చాన్స్ స్వయంగా కేంద్రం కల్పించిందని చెప్తున్నారు.