KCR: తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కరోనా సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు మేలు చేసేలా మానవత్వం చాటుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభణతో ఉపాధి కోల్పోయి అర్ధాకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు జూన్ నెలకు 15 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు.
Read More: Eatela Rajendar: ఈటల రాజేందర్… కొంత క్లారిటీ …. ఎంతో కన్ఫ్యూజన్….
ప్రభుత్వం నిర్ణయం ఇది….
జూన్ నెల రేషన్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 53లక్షల 56వేల కార్డులకు అందించే పదిహేను కిలోలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 33లక్షల 86వేల కార్డుదారులకు ఎలాంటి పరిమితి లేకుండా పదిహేను కిలోలు ఉచితంగా అందించనుంది. అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు 35 కేజీలకు అదనంగా మరో పది కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డుదారులకు పదికిలోలకు అదనంగా మరో పదికిలోల్ని అందించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 2 కోట్ల 79లక్షల 24వేల 300 మందికి లబ్ది చేకూరనుంది.
Read More: Harish Rao: హరీశ్ రావు ఆరోగ్య మంత్రి అయిపోయినట్లేనా?
పెద్ద మనసుతో ఇప్పటికే…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కరోనా సమయంలో పలు మానవత్వంతో కూడిన నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు టీచర్లకు నెలకు రూ.2000 , 25 కిలోల బియ్యం అందిస్తున్నారు. ఈ మేరకు వరుసగా 2 నెలలుగా అందజేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ , కరీంనగర్లలో హరేరామ హరేకృష్ణా సంస్థతో కలిసి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. కరోనా కాలంలో అనాథలుగా ఉన్న వారు, పని లేని వారికి ఉచితంగా అందిస్తున్న భోజనం అనేకమందికి మేలు చేస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?