NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR : కేసీఆర్ సిద్ధాంతాన్ని నిమ్మ‌గ‌డ్డ విష‌యంలో అప్లై చేస్తున్న జ‌గ‌న్ ?

KCR : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సిద్ధాంతాన్ని ఏపీ సీఎం ys jagan  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫాలో అవుతున్నారా? ఏపీ ఎస్ఈసీ  nimmagadda ramesh kumar నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ తో జ‌రుగుతున్న అధికారిక యుద్ధంలో ఆయ‌న ఈ విధానం స‌రైనద‌ని భావిస్తున్నారా?

kcr-theory-is-being-followed-by-jagan
kcr-theory-is-being-followed-by-jagan

ఇప్పుడు ఈ చ‌ర్చే ఏపీలో జ‌రుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకునోటు కేసులో కేసీఆర్ అనుస‌రించిన వైఖ‌రే ఏపీ సీఎం జ‌గ‌న్ సైతం ఫాలో అవుతున్నార‌ని అంటున్నారు.

KCR కేసీఆర్ ఏం చేశారు…. జ‌గ‌న్ ఏం చేస్తున్నారు?

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను వ్యూహాత్మ‌కంగా ఇరికించారు. అయితే ఆ కేసులో ఫ‌లితం కోసం `సీరియ‌స్‌`గా ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. ముగింపు వ‌స్తే , ఆ కేసు ఉంద‌నే భ‌యం త‌గ్గుతుంద‌నే ఉద్దేశంతో అలా కొన‌సాగిస్తున్నార‌ని అంటుంటారు. స‌రిగ్గా అదే థియరీని నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ అవ‌లంభిస్తున్నార‌ని చెప్తున్నారు.

నిమ్మ‌గ‌డ్డ ను అలాగే…

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖ‌రిపై మంత్రులు బొత్సా స‌త్య‌నారాయ‌ణ , పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రివిలేజ్ క‌మిటీ కి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నోటీసులపై ప్రివిలేజ్ కమిటీ వర్చువల్‌గా చర్చించింది. SECపై విచారణ జరిపే అధికారం కమిటీకి ఉందని ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. సభ్యులు తమ హక్కులకు భంగం కలిగిందని స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆ అంశాన్ని కమిటీకి పంపారని అన్నారు. రూల్ 173 కింది ఈ అంశంపై చర్చించామని కాకాణి వివరించారు. దీనిపై న్యాయ నిపుణులతో కూడా మాట్లాడిన తర్వాత నోటీసులు పంపాలా లేదంటే మరో విధంగా ముందుకు వెళ్లాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స‌భా హక్కుల ఉల్లంఘన నోటీసులో SECను పిలిపించవచ్చని కొందరు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే టీడీపీ సభ్యుడు అనగానికి సత్యప్రసాద్ ఈ వాదనతో విభేదించారు. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ మరోసారి సమావేశమై చర్చించాక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఈ విష‌యంలో తేల్చాలి అనుకుంటే ప్రివిలేజ్ క‌మిటీ ద్వారా తుది నిర్ణ‌యం వెలువ‌డేలా చేస్తార‌ని కానీ ఆ చ‌ర్య‌ల విష‌యంలో ఉత్కంఠ కొన‌సాగించేందుకే స‌మ‌యం తీసుకుంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

author avatar
sridhar

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk