KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధాంతాన్ని ఏపీ సీఎం ys jagan వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారా? ఏపీ ఎస్ఈసీ nimmagadda ramesh kumar నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో జరుగుతున్న అధికారిక యుద్ధంలో ఆయన ఈ విధానం సరైనదని భావిస్తున్నారా?
ఇప్పుడు ఈ చర్చే ఏపీలో జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసులో కేసీఆర్ అనుసరించిన వైఖరే ఏపీ సీఎం జగన్ సైతం ఫాలో అవుతున్నారని అంటున్నారు.
KCR కేసీఆర్ ఏం చేశారు…. జగన్ ఏం చేస్తున్నారు?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులను వ్యూహాత్మకంగా ఇరికించారు. అయితే ఆ కేసులో ఫలితం కోసం `సీరియస్`గా ప్రయత్నం చేయడం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ముగింపు వస్తే , ఆ కేసు ఉందనే భయం తగ్గుతుందనే ఉద్దేశంతో అలా కొనసాగిస్తున్నారని అంటుంటారు. సరిగ్గా అదే థియరీని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఏపీ సీఎం జగన్ అవలంభిస్తున్నారని చెప్తున్నారు.
నిమ్మగడ్డ ను అలాగే…
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరిపై మంత్రులు బొత్సా సత్యనారాయణ , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై ప్రివిలేజ్ కమిటీ వర్చువల్గా చర్చించింది. SECపై విచారణ జరిపే అధికారం కమిటీకి ఉందని ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. సభ్యులు తమ హక్కులకు భంగం కలిగిందని స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆ అంశాన్ని కమిటీకి పంపారని అన్నారు. రూల్ 173 కింది ఈ అంశంపై చర్చించామని కాకాణి వివరించారు. దీనిపై న్యాయ నిపుణులతో కూడా మాట్లాడిన తర్వాత నోటీసులు పంపాలా లేదంటే మరో విధంగా ముందుకు వెళ్లాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులో SECను పిలిపించవచ్చని కొందరు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే టీడీపీ సభ్యుడు అనగానికి సత్యప్రసాద్ ఈ వాదనతో విభేదించారు. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ మరోసారి సమావేశమై చర్చించాక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ విషయంలో తేల్చాలి అనుకుంటే ప్రివిలేజ్ కమిటీ ద్వారా తుది నిర్ణయం వెలువడేలా చేస్తారని కానీ ఆ చర్యల విషయంలో ఉత్కంఠ కొనసాగించేందుకే సమయం తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.