Corona: దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతుండగా బుధవారం ఏకంగా రెండు లక్షలకు చేరువలో కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా 1,85,190 కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 ఆ పైన బెడ్స్ ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
Corona కీలక నిర్ణయం…
రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరగనున్నాయని ప్రమాద హెచ్చరికలు రావడం తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులను ప్రభుత్వం సన్నద్ధం చేస్తోంది. తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జిల్లా DMHOలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 10 ఆ పైన బెడ్స్ ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1691 నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి అందులో 41 వేల బెడ్స్… ఉన్నాయని చెబుతున్నారు. వీటిలో ఆక్సిజన్ ఫెసిలిటీ ఉన్న బెడ్స్ 10వేలు కాగా.. 5వేల ICU బెడ్స్, 1500 వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తేల్చారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీచేశారు.
సంచలన ప్రకటన
గాలి ద్వారా కరోనా వేగంగా విస్తరిస్తోందని… ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. మహారాష్ట్ర పరిస్థితి తెలంగాణలో నెలకొనే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని కోరారు. తెలంగాణలో నాలుగు వారాలుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరో ఆరు వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రజలు సహకరించకపోతే తెలంగాణ కూడా మహారాష్ట్ర మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ముందు ముందు ఆస్పత్రిలో బెడ్లు దొరక్కుండా పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందులు రావద్దని లాక్ డౌన్ కర్ఫ్యూ వంటివి పెట్టడం లేదు కానీ తెలంగాణలో పరిస్థితి తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?