Kerala Minister: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు జరగని విధంగా ఏపి (Ap)లో వాహనాల ద్వారా రేషన్ సరుకుల (PDS) డోర్ డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి (YS Jagan Govt) సర్కార్ సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఖర్చుతో కూడుకుని ప్రభుత్వానికి భారం అయినా రేషన్ సరుకులను వాహనాల ద్వారా డోర్ డెలివరీ అంటూ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపిలో అమలు అవుతున్న రేషన్ డోర్ డెలివరీ విధానం అధ్యయనం చేసేందుకు కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జిఆర్ అనిల్ రాష్ట్రాని (విజయవాడ) కి విచ్చేశారు. ఏపి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఈ విధానం గురించి ఆయనకు వివరించారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని ఆ మంత్రి పరిశీలన చేశారు. అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సమావేశమైయ్యారు.
Kerala Minister: రేషన్ డోర్ డెలివరీ విధానం భేష్
దేశంలో ఎక్కడా 85 శాతం మందికి ఇంటింటికి బియ్యం పంపిణీ జరగడం లేదని పేర్కొన్న కేరళ మంత్రి అనిల్ ..ఈ విధానాన్ని కేరళలోనూ ప్రవేశపెట్టే ఆలోచనలో భాగంగా ఏపిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. బియ్యం పంపిణీ వ్యవస్థ, ధాన్యం సేకరణ, అర్హుల ఎంపిక, క్వాలిటీ కంట్రోల్, మార్క్ ఫెడ్, ఆర్ బీ కే ల పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపిలో సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ముంగిటకు చేరుతున్నాయని అన్నారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ ను అత్యంత పారదర్శకంగా చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఏపి నుండి కేరళకు బియ్యం రవాణా చేసే విషయంపై చర్చించినట్లు తెలిపారు.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా
ఏపిలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ సచివాలయాలు, ఆర్ బీ కేలు, వాలంటీర్ లు, రేషన్ పంపిణీ వ్యవస్థ వంటి విప్లవాత్మక కార్యక్రమాలపై అధ్యయనం చేసేందుకు అనేక రాష్ట్రాల నుండి ఇక్కడకు రావడం గర్హకారణమని అన్నారు. సుమారు 65 లక్షల మందికి ఫించన్లు పంపిణీ చేసే కార్యక్రమం అయిదారు గంటల్లో పూర్తి చేసే సామర్ధ్యం ఏపిలో ఉందన్నారు.