Kodali Nani : దయచేసి ఇలాంటి విషయాల్లో అడ్డు పడొద్దు అంటున్న కొడాలి నాని
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమానికి రాజకీయాలను అడ్డంపెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అడ్డు రావద్దు అంటూ మంత్రి కొడాలి నాని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. సామాన్య ప్రజలకు అవసరమైన సేవలు అదేవిధంగా నిత్యావసరాల వస్తువుల పంపిణీ కార్యక్రమానికి రాజకీయాలకు మూడు పెట్టొద్దు అంటూ వేడుకున్నారు. గతంలో స్టేట్ ఎన్నికల కమిషనర్ వైఖరి వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడిందని కానీ అర్బన్ ప్రాంతాల్లో నేతలెవ్వరూ లేకుండానే ఇంటింటికి రేషన్ బియ్యాన్ని మొబైల్ వాహనం ద్వారా అందించాలని హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి బియ్యం పంపిణీ పథకం ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం అమలు చేయలేక పోతున్నట్లు కొడాలి నాని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం నిర్ణయం వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉపయోగపడేలా నిర్వహిస్తున్న ఇంటింటి రేషన్ డెలివరీ కార్యక్రమానికి రాజకీయ నాయకులు అడ్డు రాకూడదు అంటూ కొడాలి నాని కామెంట్లు చేయడం ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది. ప్రభుత్వం కులం మతం ప్రాంతం పార్టీలు అనేవి చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రామాణికంగా పథకాలు అమలు చేస్తుందని ఇదే రీతిలో ఇంటింటికి రేషన్ బియ్యం కూడా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని ముందుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు అందులో ఉన్న లోటుపాట్లను పరిగణలోకి తీసుకొని మొబైల్ వాహనాలను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. పేదలకు ఎంతో ఉపయోగపడే ఇలాంటి మంచి కార్యక్రమాలకు రాజకీయాలు ముడి పెట్ట కూడదు అని పేర్కొన్నారు.