గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎడ్ల బండ ప్రదర్శన భారీ ఎత్తున సాగుతోంది. ఈసారి ముఖ్యఅతిథిగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరయ్యారు. కరోనా భయం లేకుండా కృష్ణాజిల్లాలో మాత్రమేకాక పరిసర ప్రాంతంలో నుండి కూడా భారీ ఎత్తున జనాలు ఎడ్ల బండ ప్రదర్శన తిలకించడానికి వచ్చారు.
ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జరగబోయే ఈ కార్యక్రమాని ఎన్టీఆర్ టు వైయస్సార్ ట్రస్ట్ నిర్వహిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి కొడాలి నాని కోడిపందాలు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోళ్ల పందాలలో జీవ హింస ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఎడ్ల పందాలు లో జీవహింస ఉండదని స్పష్టం చేశారు. జరగబోయే ఎడ్లబండ్ల ప్రదర్శన ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం తెలంగాణలో ఉన్న జిల్లాల నుండి అదే విధంగా ఎక్కువగా కడప మరియు ఒంగోలు జిల్లా నుండి పోటీకి ఎక్కువగా ఎడ్లు వస్తాయని స్పష్టం చేశారు.
ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే గతసారి సంక్రాంతి పండుగకు సీఎం జగన్ ఎడ్ల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం వచ్చిన సంక్రాంతికి గుడివాడ లో కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించడం జరిగింది. కాగా ఈసారి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరు కావడం జరిగింది.