Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనవరి ఫస్ట్ గుంటూరు వికాస్ నగర్ లో కార్యక్రమం తలపెట్టడం తెలిసిందే. పేదలకు జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించడానికి పెట్టిన ఈ కార్యక్రమం ముగ్గురిని బలి తీసుకుంది. అంతకుముందే నెల్లూరు జిల్లా కందుకూరు లో జరిగిన రోడ్ షోలో 8 మంది మరణించడం జరిగింది. ఈ రెండు ఘటనాలతో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గుంటూరు ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా గుంటూరులో విషాదం నెలకొందని విమర్శించారు. ఇరుకు సందులు డ్రోన్ కెమెరాలతో షూటింగ్ .. జరుపుకోవడానికి కందుకూరులో 8 మందిని బలి కొన్నారు. ఆ ఘటనపై చంద్రబాబు లోకేష్ రామోజీరావు ఏబీఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడులను బాధ్యులను చేయాలి. ఇప్పుడు పేదలకు కానుకలుస్తామని పది రోజుల నుంచి ప్రచారం చేసి ఓదరగొట్టి ఒక్కో మహిళలకు మూడు చీరలు ఇస్తామని 30 వేల మందికి టోకెన్లు పంచారు. ఆ తర్వాత చంద్రబాబు స్పీచ్ కోసం రెండున్నర గంటలను జనాలను నిలబేట్టారు. నలుగురికి చీరలు మంచి హడావిడి చేసి మిగతా వారిని పట్టించుకోకుండా సభ నిర్వాహకులు వ్యవహరించారు. దీంతో తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు.
ఈ ముగ్గురు ప్రాణాలకు బాధ్యులు ఎవరు..?, వీల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తానన్న 429 చంద్రబాబు.. మహిళలకు ఏం సమాధానం చెబుతారు. చంద్రబాబుకి సిగ్గు శరం లేదు. అధికారంలోకి రావడానికి ఎంత మంది చనిపోయిన చంద్రబాబు పట్టించుకోడు. శనికి మరో రూపమే చంద్రబాబు. ఆయన కాలు ఎక్కడపడితే అక్కడ నాశనమే. గుంటూరు ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు న్యాయ విచారణ చేపట్టాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.