konaseema district: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అల్లవరం మండలం కొమ్మరగిరిపట్నం అకులవారి వీధిలో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శనివారం వేకువ జామున తాటాకుల ఇల్లు ధగ్ధమైంది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. తాటాకుల ఇంట్లో నివసిస్తున్న తల్లి సాధనాల మంగాదెవి (40) ఆమె కుమార్తె జ్యోతి (23) మంటల్లో (Burnt Alive) కాలిపోయారు. జ్యోతికి అయిదు నెలల క్రితమే ప్రేమ వివాహం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆమె ఇప్పుడు అయిదు నెలల గర్బిణి, ఆమెను భర్త సురేష్ నిన్న రాత్రి పుట్టింటి వద్ద దింపి వెళ్లాడని చెబుతున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఈ అగ్నిప్రమాద ఘటనపై గ్రామస్తులు, మృతుల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక కుట్ర ప్రకారం ఇది జరిగిందని అంటున్నారు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది అగ్ని ప్రమాదమా, లేక ఎవరైనా ఈ ఘాతకం చేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా అనేది పోలీసు దర్యాప్తులో తేలనుంది. పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలన చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.