Krishna Board: కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది, సమావేశం తేదీని త్వరలో ప్రకటిస్తామని కృష్ణాబోర్డు తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివావాదం నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ (శుక్రవారం) కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించతలపెట్టింది.
ఏపి ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ తెలంగాణ సర్కార్ కేఆర్ఎంబీకీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథఖం అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ నిర్మిస్తోందని, శ్రీశైలం, సాగర్, పులిచింతల నుండి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంతో సాగునీరు సముద్రం పాలవుతున్నాయని ఏపి ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ జల వివాదంపై చర్చించేందుకు బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 9న నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ భేటీని వాయిదా వేయాలని తెలంగాణ సర్కార్ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. 20వ తేదీ తరువాత సమావేశం నిర్వహించాలని కోరింది. దీంతో సమావేశాన్ని కృష్ణా బోర్డు వాయిదా వేసింది.