KTR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఒకే ప్రాంతం కారణంగా వార్తల్లోకి ఎక్కారు. దేశం కోసం వీరమరణం పొందిన వ్యక్తి కారణంగా మంత్రి కేటీఆర్ వార్తల్లో నిలిస్తే, తన తండ్రికి వీరాభిమాని కారణంగా షర్మిల వార్తల్లోకి ఎక్కారు. ఈ ఇద్దరి కారణంగా సూర్యపేట జిల్లా వార్తల్లో నిలిచింది .
Read More: KCR: కేసీఆర్ భారీ కల… అడ్డం పడుతున్న కాంగ్రెస్ పార్టీ
కేటీఆర్ ఏం చేశారంటే…
భారతావని కోసం భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Read More: YS Sharmila: షర్మిల విషయంలో .. కేసీఆర్ వ్యూహం అదేనా?
వీరాభామాని కోసం షర్మిల …
మరోవైపు సూర్యాపేట జిల్లాలో వైఎస్ షర్మిల రేపు పర్యటించనున్నారు. రెండు కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదన్న బాధతో హుజుర్ నగర్ లో నీలకంఠ సాయి అనే యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. నీలకంఠ సాయి కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. దీంతోపాటుగా వైఎస్సార్ వీరాభిమాని అయిన ఎక్సైజ్ మాజీ సూపరింటెండెంట్ గుణ్ణం నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కరోనాతో మృతిచెందిన గుణ్ణం నాగిరెడ్డి నాగిరెడ్డి కుటుంబానికి షర్మిల భరోసా కల్పించనున్నారు.