KTR : ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇరకాటంలో పడేలా తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యవహరించారని అంటున్నారు. ఓ వైపు జరుగుతున్న పరిణామాలు మరోవైపు వివిధ పార్టీలు విరుచుకుపడుతున్న తీరు చూస్తుంటే ఏపీలో స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ టార్గెట్ అయ్యారని కొందరు కామెంట్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరులో సమ్మె సైరన్ మోగింది. 28 రోజులుగా నిరసనలు, దీక్షలు చేపడతున్న కార్మికులు, ఉద్యోగులు కీలక అస్త్రం ప్రయోగించారు. యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. విశాఖ ఉక్కు పోరాటానికి సంఘీభావం తెలుపుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ టాక్ వస్తోంది.
KTR కేటీఆర్ ఏమంటున్నారు?
విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా మార్చి 25 నుంచి విధుల బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ మద్దతు ప్రకటించారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ ఈ నిర్ణయం శుభపరిణామం అన్నారు. ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామన్న కేటీఆర్కు అభినందనలు తెలిపారు. కేటీఆర్ స్ఫూర్తితో సెలబ్రిటీలు కూడా మద్దతు ప్రకటించాలని గంటా అన్నారు. ఉక్కు ఉద్యమం రేపటి నుంచి మరింత ఉధృతం అవుతుందని.. చంద్రబాబు ఓ అడుగు ముందుకువేసి ప్రభుత్వానికి సహకరిస్తామనడం శుభపరిణామంగా పేర్కొన్నారు.
కేటీఆర్ పేరు చెప్పి జగన్ ను టార్గెట్ చేసి….
మరోవైపు ఈ ఎపిసోడ్పై టీడీపీ ఘాటుగా స్పందించారు. విశాఖ ఉక్కుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడినంత ధైర్యంగా కూడా ఏపీ సీఎం జగన్ మాట్లాడడం లేదని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. విశాఖ ఉక్కు పోరాటానికి సంఘీభావం తెలుపుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు. పక్క రాష్ట్ర మంత్రిగా ఉన్న కేటీఆర్… పోరాటానికి అనుకూలంగా మాట్లాడితే.. ఏపీ సీఎం మాత్రం లేఖ రాసి కూర్చున్నారని వర్ల రామయ్య విమర్శించారు.