KTR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ఖాతాలో మరో రికార్డు చేరింది. కరోనా సమయంలో తెలంగాణ భారీ పెట్టుబడి సాధించింది. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ రంగంలో రూ. 2100 కోట్ల పెట్టుబడి పెట్టాలని ట్రైటాన్ ఈవీ (TRITON EV) కంపెనీ నిర్ణయించింది.
Read More: KCR: ఇంకో ప్రతిష్టాత్మక నిర్మాణం కూల్చివేత… భారీ ఆస్పత్రి కట్టనున్న కేసీఆర్
అక్కడ భారీ యూనిట్….
జహీరాబాద్ నిమ్జ్లో తన ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ట్రైటాన్ ఈవీ (TRITON EV) కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పెట్టుబడితో సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తొలి ఐదేళ్లలో సుమారు 50వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీనికి సంబంధించిన ఎంవోయూ మీద కంపెనీ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వం సంతకాలు చేశాయి. తమ పెట్టుబడి కోసం తెలంగాణను ఎంచుకున్నందుకు కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడితో దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More: KCR: కేసీఆర్ కంట్లో పడిన సీనియర్.. ఇక అన్నీ మంచిరోజులే..
ఇటీవలే ఓ రికార్డు…
ఇటీవలే తెలంగాణ ఐటీ ఓ రికార్డు సృష్టించారు. గత ఏడేళ్లలో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య, ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు నాటికి హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు ఉండగా, 2020–21 నాటికి రూ.1,45,522 కోట్లకు పెరిగింది. 2014లో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3,23,396 ఉండగా, ఇప్పుడు 6,28,615కు చేరింది. రాష్ట్ర ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ 2020–21 వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అలాగే రాష్ట్ర జీఎస్డీపీ ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా, రూ.9.78 లక్షల కోట్లుగా నమోదైందని ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్ మెంట్ 2020–-21 వార్షిక నివేదికలో ప్రకటించింది. ఈ నివేదిక తర్వాత తెలంగాణకు భారీ పెట్టుబడి రావడం గమనార్హం.