NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

KTR Meets YS Jagan: ఇక్కడ పాలనను విమర్శించినా అక్కడ అప్యాయంగా పలకరింపులు..ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..?

KTR Meets YS Jagan: ఇటీవల కాలం వరకూ ఆ పార్టీ నేతలు ఈ ప్రభుత్వ పాలనపై విమర్శించారు. వీళ్లు ఆ పార్టీ నేతలను విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ చేసుకున్నారు. ఆ రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంట, విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఉన్నాయంట అంటూ తెలంగాణ మంత్రి కేటిఆర్ విమర్శలు గుప్పించారు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు స్పందించారు. కాస్త సాఫ్ట్ గా ప్రతి విమర్సలు చేశారు. ఆ తర్వాత మంత్రి కేటిఆర్…ఏదో టంగ్ స్లిప్ అయ్యింది, సోదరుడు జగన్ పాలనను కించపర్చాలని ఉద్దేశం లేదంటూ వివరణ ఇవ్వడంతో విమర్శలు, ప్రతి విమర్శలు ఆగిపోయాయి. అంతకు ముందు తెలంగాణ సీఎం కేసిఆర్ సైతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడినా ఏపి సీఎం వైఎస్ జగన్ వీటిని అంతగా పట్టించుకోలేదు. సరిహద్దు రాష్ట్రంతో సామరస్యంగా ఉండాలన్న ఆలోచనే ఏపి సీఎం జగన్ కు మొదటి నుండి ఉండేది. కాకపోతే నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య పంచాయతీ ఇంకా తీరలేదు. విద్యుత్ బాకీల చెల్లింపులు జరగలేదు. ఇవన్నీ ఎలా ఉన్నా.. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ఏపి సీఎం వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి కేటిఆర్ పరస్పరం అప్యాయంగా కలుసుకుని మాట్లాడుకోవడం విశేషం.

KTR Meets YS Jagan
KTR Meets YS Jagan

KTR Meets YS Jagan: దావోస్ లో జగన్, కేటిఆర్ అప్యాయంగా పలకరింపులు

రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు దావోస్ సదస్సులో పాల్గొని పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా తమ తమ రాష్ట్రాల్లో అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. తమ తమ రాష్ట్రాల్లో ఉన్న వనరులు, ప్రభుత్వ సహకారం తదితర విషయాలను వెల్లడిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను తెలంగాణ లో నెలకొల్పేందుకు లూలూ గ్రూపుతో మంత్రి కేటిఆర్ ఒప్పందం చేసుకున్నారు. 60వేల కోట్ల పెట్టుబడితో పంప్ హైడల్ పవర్ స్టోరేజీ తో పాటు సోలార్ పవర్ ఉత్పత్తి ప్రాజెక్టును ఏపిలో నెలకొల్పేందుకు ఆదానీ గ్రూపుతో ఏపి సీఎం వైఎస్ జగన్ ఒప్పందం చేసుకున్నారు. ఇలా రాష్ట్రాల్లో పెట్టుబడులు తేవడానికి పోటీ పడుతున్న ఈ ఇద్దరూ నేతలు వివిధ కంపెనీలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంలో ఏపి సీఎం వైఎస్ జగన్ ను కలుసుకున్న తెలంగాణ మంత్రి కేటిఆర్ ఈ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నా సోదరుడు, ఏపి సీఎం వైఎస్ జగన్ తో సమావేశం గొప్పగా జరిగింది అని ట్వీట్ లో పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను దెబ్బతీసుకోకుండా ఆప్యాయతతో ఉంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగడం అభినందనీయమే.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!