KTR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అవాక్కయ్యే పరిణామం ఇది. నెట్టింట ట్విట్టర్ ద్వారా ప్రజలతో అనుసంధానం అయ్యే కేటీఆర్ కు అదే ట్విట్టర్లో ఊహించని ట్వీట్ వచ్చింది. అసలు రిప్లై ఏం ఇవ్వాలో తెలియని గందరగోళంలో పడిపోయిన కేటీఆర్ సమాధానం సైతం సదరు నెటిజన్ ను అడిగాడు. ఇదంతా ఓ బిర్యానీ గురించిన చర్చ.
Read More: KCR: తెలంగాణలో కేసీఆర్ దిమ్మతిరిగి పోయే కుంభకోణం బట్టబయలు?
Read More : KCR: ఈటలకు తన రాజకీయం రుచి చూపిస్తున్న కేసీఆర్
బిర్యానీలో లెగ్ పీస్ లేదు సర్….
ఓ నెటిజన్ తనకు బిర్యానీలో జరిగిన అవమానం గురించి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. “సార్… లెగ్ పీస్ కలిగి ఉన్న మంచి మసాల దట్టించిన బిర్యానీ ఇవ్వాలని ఆర్డర్ చేశాను. దానికి ఈ బిర్యానీ ఇచ్చారు. ఇదేనా సార్ చేయాల్సింది?“ అంటూ బిర్యానీ ఫోటో పెట్టి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో ఆశ్చర్యపోయిన కేటీఆర్ అసలు ఏం రిప్లై ఇవ్వాలో తెలియక… ఈ ట్వీట్ లో నన్ను ఎందుకు ట్యాగ్ చేశావు బ్రదర్. నేను ఏం చేయాలి? “ అంటూ ఆశ్చర్యపోయారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సహజంగానే పలువురు కామెంట్లు పెట్టారు. అయితే, ఇందులో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ రీట్వీట్ ఆసక్తికరంగా ఉంది.
Read More:
అసదుద్దీన్ ఏమంటున్నారంటే…
బిర్యానీలో లెగ్ పీస్ గురించి సదరు నెటిజన్ చేసిన కామెంట్ కు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ భలే రిప్లై ఇచ్చారు. “ఈ బిర్యానీ సమస్య విషయంలో మీ ఆఫీసు సిబ్బంది స్పందించాలని ఆయన అనుకుంటున్నాడేమో. వారంతా ఈ కరోనా సమయంలో వైద్య సహాయంలో బిజీగా ఉన్నారని చెప్పండి“ అంటూ చురక అంటించారు.