Kuppam (Chittoor): తమ డిమాండ్ ను పరిష్కరించాలని కోరుతూ కుప్పం ద్రావిడ విశ్వ విద్యాలయం తాత్కాలిక ఉద్యోగులు చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరుకుంది. సోమవారం వర్శిటీ ప్రధాన ద్వారం వద్ద తాత్కాలిక ఉద్యోగులు గడ్డిని తింటూ వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ లను అధికారులు తక్షణం పరిష్కరించాలని కోరారు.
వేతనాలు చెల్లించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనం దుర్భరంగా మారిందని, ఇప్పటికైనా వర్సిటీ ఉన్నతాధికారులు కళ్లు తెరవాలని వారు కోరారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.