Kuppam Municipal Election: ఏపిలో నెల్లూరు కార్పోరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీకి సైతం ఎన్నిక జరుగుతుండటంతో వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టీ ఈ మున్సిపాలిటిపై ఉంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులకు గానూ ఒక వార్డు (14వ వార్డు) ఏకగ్రీవం కాగా మిగిలిన 24 వార్డుల్లో 87 మంది పోటీకి రంగంలో ఉన్నారు. 14వ వార్డు వైసీపీకి ఏకగ్రీవం అయ్యింది.
Kuppam Municipal Election: పోటీలో ఉన్న వైసీపీ, టీడీపీ అభ్యర్ధుల వివరాలు ఇవే
1వ వార్డు (ఎస్టీ జనరల్)లో ముగ్గురు అభ్యర్ధులు ఉన్నారు. సీ జగదీష్ (వైసీపీ), నాగరాజు (టీడీపీ)
2వ వార్డు (బీసీ జనరల్) లో ముగ్గురు ఉన్నారు. ఆర్ మునిరాజు (వైసీపీ), ఎం రోహిత్ కుమార్ (టీడీపీ).
3వ వార్డు (ఎస్సీ జనరల్) లో అయిదుగురు అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఎం అరవింద్ (వైసీపీ), జి వెంకటేశ్ (టీడీపీ)
4వ వార్డు (జనరల్ మహిళ)లో వికే జ్ఞానవతి (టీడీపీ) ఆర్ రాజమ్మ (వైసీపీ)
5వ వార్డు (బీసి జనరల్) లో ముగ్గురు పోటీలో ఉన్నారు. సిపి మనోహర్ (వైసీపీ), వి శల్వరాజ్ (టీడీపీ)
6వ వార్డు (బిసి మహిళ) లో ముగ్గురు పోటీలో ఉన్నారు. ఐ జయంతి (వైసీపీ), పివి సరస్వతిదేవి (టీడీపీ),
7వ వార్డు (ఎస్సీ జనరల్) లో అయిగురు రంగంలో ఉన్నారు. ఎం నాగరాజు (వైసీపీ), ఆర్ రాజేశ్ (టీడీపీ), బి లోకేష్ (బీజేపి)
8వ వార్డు (ఎస్సీ మహిళ) లో ముగ్గురు ఉన్నారు. ఎం కళ (టీడీపీ), చంద్రమ్మ (వైసీపీ).
9వ వార్డు(బీసీ జనరల్) లో ముగ్గురు రంగంలో ఉన్నారు. ఆర్ నాగభూషణం నాయుడు (టీడీపీ), ఎస్డి హఫీజ్ (వైసీపీ)
10వ వార్డు (జనరల్ మహిళ) లో నలుగురు పోటీలో ఉన్నారు. మమత (వైసీపీ), వి శోభ (టీడీపీ).
11వ వార్డు (జనరల్ మహిళ) లో అయిదుగురు పోటీలో ఉన్నారు. వి కస్తూరి (టీడీపీ), వెంకట లక్ష్మి (వైసీపీ).
12వ వార్డు (బీసీ మహిళ) లో జి కోకిలమ్మ (టీడీపీ), సి మాధవి (వైసీపీ),
13వ వార్డు (బిసి మహిళ) లో ముగ్గురు పోటీల ఉన్నారు. హేమ్సా (వైసీపీ), వి నలిని (టీడీపీ).
15వ వార్డు (ఎస్సీ మహిళ) తిలగావతి (వైసీపీ), వి జయలక్ష్మి (టీడీపీ).
16వ వార్డు (అన్ రిజర్వుడ్) లో ముగ్గురు పోటీలో ఉన్నారు. దర్బా సుధీర్ (వైసీపీ), జి హర్ష ధర్మతేజ (టీడీపీ).
17వ వార్డు (జనరల్ మహిళ) లో నలుగురు పోటీలో ఉన్నారు. ఆర్ దేవకి (వైసీపీ), ఎం శాంతి (టీడీపీ),
18వ వార్డు (జనరల్ మహిళ)లో అయిదుగురు పోటీలో ఉన్నారు. ఎన్సి గీత (వైసీపీ), సోభన తేజ్ (టీడీపీ), ఎస్ జ్యోతి (బీజేపి).
19వ వార్డు (అన్ రిజర్వుడ్) లో అయిదుగురు పోటీలో ఉన్నారు. బి కే దామోదరం (టీడీపీ), ఎస్ సునీల్ కుమార్ (వైసీపీ).
20వ వార్డు (అన్ రిజర్వుడ్) లో అయిదుగురు పోటీలో ఉన్నారు. ఎం మునిరత్నం (వైసీపీ), ఎస్ సోమశేఖర్ (టీడీపీ), ఎం సాక్షి వేలు (బీజేపీ).
21వ వార్డు (జనరల్ మహిళ) లో ముగ్గురు పోటీలో ఉన్నారు. లావన్య (వైసీపీ), వి సుభ (టీడీపీ),
22వ వార్డు (అన్ రిజర్వుడ్) లో ముగ్గురు పోటీలో ఉన్నారు. జిఎస్ ఆరుల్ (వైసీపీ), బి సురేష్ కుమార్ (టీడీపీ)
23వ వార్డు (ఎస్సీ జనరల్) లో నలుగురు పోటీలో ఉన్నారు. ఎస్ భారధి (టీడీపీ), కే రాజ్ కుమార్ (వైసీపీ).
24వ వార్డు (అన్ రిజర్వుడ్) లో అయిదుగురు రంగంలో ఉన్నారు. డీఎస్ త్రిలోక్ (టీడీపీ), సయ్యద్ ఆలీ (వైసీపీ) ఆర్ మంజునాధ్ (బీజేపీ).
25వ వార్డు (జనరల్ మహిళ) గౌతమి (టీడీపీ), మంజుల (వైసీపీ).
కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డుల్లో నాలుగు వార్డుల్లో మాత్రమే బీజేపీ అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. జనసేన అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయలేదు.