L.Ramana: గత కొద్దికాలంగా జరుగుతున్న చర్చను నిజం చేస్తూ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ పదవికి రాజీనామా చేసేశారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా, రాష్ర్ట ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను అని రమణ తెలిపారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. అయితే, ఈ ఎపిసోడ్పై టీడీపీ ఆశ్చర్యకర రీతిలో స్పందించింది. బాంబులు కాల్చి సంబురాలు చేసుకుంది.
Read More: KCR: ఉప ఎన్నికకు అప్పుడే ఎత్తుగడ వేసేసిన కేసీఆర్
రమణ ఏమంటున్నారంటే..
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తో కలిసి సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటి అయ్యారు. అనంతరం రమణ మీడియాతో మాట్లాడుతూ తమ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్థానం, గత ఏడేళ్లలో స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చించినట్టు వివరించారు. తెలంగాణలో జరుగుతున్న ప్రగతిపై సీఎం కేసీఆర్ విడమరచి చెప్పారని, తన 27 ఏళ్ల రాజకీయ జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన తన నేపథ్యాన్ని సీఎం ప్రత్యేకంగా గుర్తుచేయడం గొప్ప విషయమని రమణ కొనియాడారు. తన నేపథ్యాన్ని, అనుభవాన్ని అర్థం చేసుకొని ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని, అధికారపక్షంలో ఉండి, ముందుకెళ్తానని ప్రకటించారు. తనలాంటి వాళ్లు టీఆర్ఎస్లో ఉంటే బావుంటుందని స్వయంగా సీఎం కేసీఆర్ ఆహ్వానించారని, అందుకు తాను సానుకూలంగా స్పందించానని ఎల్ రమణ అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాసిన లేఖలో చంద్రబాబుకు తెలియజేశారు. గత 30 సంవత్సరాలుగా తన ఎదుగుదలకు తోడ్పాటు అందించిన చంద్రబాబుకు రమణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Read More: KCR: కేసీఆర్కు ఇంత కులపిచ్చి ఉందా?
రమణ వెళ్లిపోయారని టపాసులు..
అయితే, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పార్టీకి గుడ్ బై చెప్పడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశ్చర్యకరంగా స్పందించాయి. పార్టీకి చెందిన నాయకులు టీడీపీ కార్యాలయం వద్ద బాంబులు కాల్చారు. రమణ పోయినంత మాత్రాన నష్టమేం లేదన్నారు. పార్టీలో నుంచి నేతలు వెళ్లిపోవడం టీడీపీకి కొత్త కాదని.. ఒకరు పోతే మరో నేత రెడీ అవుతారని వ్యాఖ్యానించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?