అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కన్నుమూయడంతో జరుగుతున్న నాగార్జున సాగర్ ఎన్నికల విషయంలో కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. మరికొద్ది రోజులల్లో నాగార్జున సాగర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కి ఊహించని షాక్లు తగులుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ఆయన ఇరుకున పడుతున్నారు.
జానారెడ్డి కి గతంలోనే…
జానారెడ్డి ముఖ్య అనుచరుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి ఇటీవలే ఆయన నాయకత్వానికి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరారు. తాజాగా జానారెడ్డి ప్రధాన అనుచరుడు డా.రవి కుమార్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ , కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన నడుస్తోందని ఆరోపించారు. కేంద్రంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాదిరిగా నాగార్జున సాగర్ లో కూడా జానారెడ్డి కుటుంబ పాలన చేస్తున్నాడని ఆయన విమర్శించారు. జానా రెడ్డి వారసత్వ రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నాడని జానారెడ్డి కోసం తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. బిజెపి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుణ్ణి అయి బీజేపీ పార్టీ లో చేరుతున్నానన్న ఆయన నియోజక వర్గం నుండి గిరిజన గొంతును వినిపిస్తానని రవి కుమార్ నాయక్ అన్నారు. దీంతో ఉప ఎన్నిక పోరు మరింత ఉత్కంఠగా మారింది.
వీరిలో ఎవరు బరిలో దిగుతారు?
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి పేరు ఖరారు కావడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవశం చేసుకునేందుకు టీఆర్ఎస్ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. బీజేపీ ఆలోచనలు కూడా ఇలాగే సాగుతున్నాయి. ఎవరిని బరిలో దించితే ఫలితం అనుకూలంగా ఉంటుందోనని కమలనాథులు సర్వేలు.. రీసర్వేలు చేయిస్తున్నారు . అయితే, అభ్యర్థి ఎవరన్నది అధిష్ఠానం ప్రకటించక పోయినా.. తానే క్యాండిడేట్ అని చెప్పుకొంటూ 2018 ఎన్నికల్లో పోటీ చేసిన నివేదిత రెడ్డి ప్రచారం ప్రారంభించేశారు. నివేదిత భర్త శ్రీధర్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కావడంతో ప్రచార రథాలను తయారు చేయించి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారుబీజేపీలో చేరిన జానారెడ్డి ముఖ్య అనుచరుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి సైతం పోటీకి సై అంటున్నారట. ఇదే సమయంలో , 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. ఇప్పుడు బీజేపీలో ఉన్న కడారి అంజయ్య సైతం టికెట్ ఆశిస్తున్నారు. కాకపోతే ఆయనది నాగార్జునసాగర్ కాకపోవడంతో టికెట్ దక్కుతుందా అనే టాక్ ఉంది. మొత్తంగా ఉప ఎన్నికల బరిలో జానారెడ్డితోపాటు అధికార పార్టీ అభ్యర్థి ఉంటారు. రెండు బలమైన శక్తులను ఢీకొట్టాలంటే అంతకంటే బలంగా ఫైట్ చేయాలన్నది కమలనాథుల ఆలోచన.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?