YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బ్యాడ్ టైం మొదలైందా? ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఢిల్లీ వరకు చేరిందా? ఏకంగా ఆయనకు చుక్కలు చూపించే గేమ్ నడుస్తోందా? అంటే అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.
పంచాయతీ ఎన్నికల కేంద్రంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఈ చర్చ జరుగుతోంది.
YS Jagan ఢిల్లీలో ఏం జరుగుతోంది ?
పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాను కలిసిన టీడీపీ ఎంపీలు రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వైపీసీ దురాగతాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. “రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా విమర్శించినా ప్రతిపక్ష నేతలు, మీడియాపై కూడా కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశాం.. ప్రతిపక్ష నేతలపై దాడులకు దిగుతున్నారని.. వీటిపై విచారణ జరపాలని కేంద్ర హోంమంత్రిని కోరాం. అన్నింటికీ సంబంధించిన ఆధారాలను కూడా హోంమంత్రి షాకు సమర్పించామన్న టీడీపీ ఎంపీ.. ఇంకా ఏమైనా ఆధారాలు, వీడియోలు ఉంటే కూడా హోంశాఖ కార్యాలయానికి ఇవ్వాలని అమిత్షా సూచించారు. ఇలాంటివి జరుగుతుంటే చూస్తూ ఊరుకోం అనే అభిప్రాయాన్నిఅమిత్ షా వ్యక్తం చేశారు“ అని ఎంపీ కనకమేడల మీడియాకు తెలిపారు.
వైసీపీ వణికిపోతోందా ?
“ఇలాంటివి జరుగుతుంటే చూస్తూ ఊరుకోం“ అని అమిత్ షా చెప్పారు అనే కామెంట్ చేయడం ద్వారా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టేలా , భయపెట్టేలా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎత్తుగడలు వేస్తోందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో తమ సర్కారు విషయంలో , తమ పార్టీ వైఖరి విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు క్లారిటీ ఉందని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. `ఢిల్లీలో మారుతున్న సీన్… వణికిపోతున్న వైఎస్ జగన్ ` అని తెలుగుదేశం పార్టీ నేతలు ఊహించుకునేందుకు మాత్రమే పనికి వస్తుందని అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు.